హైదరాబాద్ ఐఎస్ఐకి అడ్డాగా మారింది
NEWS Aug 16,2025 08:19 am
ఐఎస్ఐకి హైదరాబాద్ అడ్డాగా మారిందని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గుజరాతీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి వారిపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఏంఐఏం కలిసి కుట్రలు చేస్తున్నాయంటూ ఆరోపించారు. మార్వాడీలు మన దగ్గర వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టే మన జీడీపీ పెరిగిందన్నారు. దేశంలో ఏ ప్రాంతం వారైనా ఎక్కడైనా నివసించే హక్కు ఉంటుందన్నారు. అనేక మంది రోహింగ్యాలు మన హైదరాబాద్ లో ఉంటున్నారు, మరి దానికి ఏం అంటారని ప్రశ్నించారు.