స్త్రీ శక్తి పథకం కోసం 8,450 బస్సులు
NEWS Aug 16,2025 07:18 am
ఆర్టీసీ బలోపేతానికి అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు. స్త్రీ శక్తి పథకం అమలుకు రాష్ట్రవ్యాప్తంగా 8,450 బస్సులను సిద్ధం చేసినట్లు చెప్పారు. సంవత్సరానికి సుమారు రెండు వేల కోట్ల ఖర్చు కానుందని వెల్లడించారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెంపు, ఆర్టీసీ ఖాళీ స్థలాలను వినియోగించి ఆదాయ మార్గాలు పెంచే చర్యలు చేపడతామని అన్నారు మంత్రి.