ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ
NEWS Aug 15,2025 03:09 pm
ఏపీ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి మహిళ ఉచిత బస్సు ప్రయాణం ఫథకానికి శ్రీకారం చుట్టింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ మహిళలతో కలిసి బస్సులో ప్రయాణం చేశారు. రాష్ట్రంలోని 2.62 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుందన్నారు సీఎం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ , ఎక్స్ప్రెస్ సర్వీసులలో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని స్పష్టం చేశారు ఎండీ.