''ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం''
NEWS Aug 15,2025 03:09 pm
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తమ కీలక ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా కీలక ముందడుగు వేసింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే 'స్త్రీ శక్తి' పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ విజయవాడలో లాంఛనంగా ప్రారంభించారు. పండిట్ నెహ్రూ బస్టాండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు.