జల్సాల కోసం ఢిల్లీకి వెళ్లడం లేదు
NEWS Aug 15,2025 05:02 pm
సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు ఢిల్లీ టూర్ పై. జల్సాల కోసం కాదు తెలంగాణ ప్రయోజనాల కోసమే వెళుతున్నానని అన్నారు. తాను హస్తినకు వెళుతున్న ప్రతీసారి తనను ట్రోల్ చేస్తున్నారని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంటే అక్కడికి కాకుండా దుబాయ్ వెళ్తారా అని ప్రశ్నించారు. మెట్రో, మూసీ, ఇతర అనుమతులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉన్న సీఎం బంగ్లా ఫామ్ హౌస్ కాదు, దావత్ లు చేసుకోడానికి అంటూ ఎద్దేవా చేశారు.