స్వాతంత్ర వేడుకలకు ఖర్గే, రాహుల్ దూరం
NEWS Aug 15,2025 04:54 pm
ఢిల్లీలో జరిగిన 79వ స్వాతంత్ర వేడుకులకు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ హాజరు కాలేదు. గత ఏడాది జరిగిన వేడుకలలో సీట్ల కేటాయింపులో వివక్ష చూపించారని, అందుకే ఈసారి దూరంగా ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ విషయంపై ఏఐసీసీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా సోషల్ మీడియా వేదికగా జాతిని ఉద్దేశించి 143 కోట్ల మంది భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు ఇద్దరు నేతలు.