ఒక కుర్చీ కోసం 10 మంది పోటీ
NEWS Aug 15,2025 01:27 pm
సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. రాజకీయాల్లో ఒక కుర్చీ కోసం 10 మంది పోటీ పడతారని అన్నారు. ఒకరు ఆ కుర్చీలో కుర్చున్నప్పుడు మిగిలిన 9 మంది నిరాశ చెందడం సహజమేనని పేర్కొన్నారు. ప్రత్యర్థులు సృష్టించే అపోహలకు లోనై వాటిని వ్యాపింప చేస్తే మన దేశానికి, రాష్ట్రానికి, మనందరికీ నష్టం కలుగుతుందన్నారు.