నేటి నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
NEWS Aug 15,2025 11:36 am
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తన ఎన్నికల హామీల అమలులో మరో కీలక ముందడుగు వేసింది. సూపర్ సిక్స్ పథకాలలో అత్యంత ప్రాధాన్యమున్న ‘స్త్రీ శక్తి’ పథకానికి నేడు శ్రీకారం చుట్టనుంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, యువతులు, థర్డ్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు విజయవాడలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో రాష్ట్రంలోని సుమారు 2.62 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుంది.