BSNL కు రూ. 47 వేల కోట్ల ఆర్థిక సాయం
NEWS Aug 15,2025 11:19 am
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) నెట్వర్క్ విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. సంస్థ పునరుద్ధరణ కోసం ఇప్పటికే అనేక ప్యాకేజీలు ప్రకటించిన కేంద్రం, ఇప్పుడు అదనంగా 4G, 5G నెట్వర్క్ విస్తరణకు మరో రూ. 47 వేల కోట్ల నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. దేశంలో బీఎస్ఎన్ఎల్ సేవలను మరింత బలోపేతం చేయడానికి ఉపయోగ పడుతుందని పేర్కొంది .