నయా ఇండియా కాదు ప్రధాని మోడీ చేతిలో భారత దేశం బందీగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్బంగా సమున్నత భారతావని తల దించుకునేలా బీజేపీ పాలన సాగిస్తోందని ఆరోపించారు. దేశంలో రాచరిక పాలన సాగుతోందని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. కార్పొరేట్ కంపెనీలకు మౌలిక సదుపాయాలను కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు