రిగ్గింగ్ వల్లనే ఉప ఎన్నికల్లో గెలుపు
NEWS Aug 14,2025 06:29 pm
కడప జిల్లాలో తాజాగా జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందడంపై స్పందించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఉప ఎన్నికలను ప్రభుత్వం అపహాస్యం చేసిందన్నారు. ఎన్నికలంటే ప్రభుత్వానికి అభద్రత ఎందుకో చంద్రబాబు చెప్పాలన్నారు. చంద్రబాబుకు తన పాలనపై నమ్మకం లేదని అర్థమవుతోందన్నారు. ఎంపీని అదుపులోకి తీసుకుంటారు.. మంత్రిని మాత్రం విచ్చలవిడిగా తిరగనిస్తారా అని ఫైర్ అయ్యారు. పోలీసులు, టీడీపీ కార్యకర్తలు అక్రమాలకు పాల్పడ్డారని, ఎన్నికల ప్రక్రియ జరిగిన రోజును బ్లాక్డేగా భావిస్తున్నాం అన్నారు.