విభజన గాయాల స్మారక దినోత్సవం
NEWS Aug 15,2025 08:37 am
మల్యాల మండలం ముత్యంపేటలో మండల బీజేపీ ఆధ్వర్యంలో విభజన గాయాల స్మారక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనాడు దేశ విభజన సమయంలో నెలకొన్న భయానక పరిస్థితుల్లో ప్రాణ త్యాగాలు చేసిన వారిని స్మరించుకుంటూ ముత్యంపేటలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రవి, మహిపాల్ రెడ్డి, మల్లేశం, శ్రీనివాస్, శ్రీకాంత్, గౌతమ్, తదితరులు పాల్గొన్నారు.