కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ నిప్పులు చెరిగారు. ఓట్ల జాబితాలో చోరీ జరిగిందనేది వాస్తవమని, రాహుల్ ఆరోపణల్లో వాస్తవం ఉందన్నారు. వెంటనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రక్షాళన చేయాలని కోరారు. ఈసీ బీజేపీకి, మోదీకి జేబు సంస్థగా మారిందని ఆరోపించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి రాహుల్ ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. బీజేపీ పెద్దల దృష్టిలో పడేందుకే చిల్లర కామెంట్స్ చేశారంటూ ఫైర్ అయ్యారు.