ఎంతో ఉత్కంఠ రేపిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన లతా రెడ్డి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీకి చెందిన అభ్యర్థి హేమంత రెడ్డిపై 6 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. లతా రెడ్డికి 6,833 ఓట్లు రాగా వైసీపీ క్యాండిడేట్ కు 682 ఓట్లు మాత్రమే వచ్చాయి.