హనుమకొండ కలెక్టరేట్లో కాజీపేట దర్గా ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లపై వరంగల్ మేయర్ గుండు సుధారాణి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనెల 17 నుంచి 22వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దర్గా ఉర్సు ఉత్సవాలు ఏర్పాట్లు, నిర్వహణ, బందోబస్తు.. తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలపై చర్చించారు. ఈ ఏడాది కూడా దర్గా ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.