జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన 36 కేసుల్లో నిందితుల వద్ద నుంచి సీజ్ చేసిన 35.96 కిలోల గంజాయిని దగ్ధం చేశారు. NDPS చట్ట ప్రకారం జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ, ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సుమారు రూ.9 లక్షలు విలువైన గంజాయిని పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ దగ్ధం చేసినట్టు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.