బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక్కొక్కడి తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. గతంలో టీడీపీ హయాంలో రాష్ట్ర తలసరి ఆదాయం పెంచామన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. కొంతమంది వ్యక్తులు రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. వాళ్ల పేర్లు కూడా చెప్పడం తనకు ఇష్టం లేదన్నారు. సమయం వచ్చినప్పుడు చెప్పడమే కాదు..వారి భరతం పడతామన్నారు.