ఏపీలో శాంతి భద్రతలు లేవన్నారు మాజీ సీఎం జగన్ . నిన్న జరిగిన ఘటనలే అందుకు ఉదాహరణ అన్నారు. వైసీపీకి సంబంధించిన ఏజెంట్లు లేకుండా పోలింగ్ ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. వైసీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్లలో కూర్చోనీయలేదని ఆరోపించారు. 15 పోలింగ్ బూత్లలో వైసీపీ ఏజెంట్లు లేకుండా చేశారని అన్నారు. రాష్ట్రంలో ఇంత అన్యాయంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదన్నారు.