బెంగుళూరుకు చెందిన కె.యం.శ్రీనివాస మూర్తి అనే భక్తుడు బుధవారం భోగ శ్రీనివాస మూర్తికి అలంకరించేందుకు రూ.25 లక్షలు విలువైన వజ్రం, వైజయంతి పొదిగిన 148 గ్రాముల బంగారు లక్ష్మీ పతకాన్ని విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆభరణాన్ని అందజేశారు.