బెంగుళూరుకు చెందిన శ్రీ కల్యాణ్ రామన్ కృష్ణమూర్తి అనే భక్తుడు బుధవారం టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టు రూ.కోటి విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమల లోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్బంగా భక్తుడు శ్రీ కళ్యాణ్ రామన్ కృష్ణమూర్తిని అభినందించారు.