తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 77 వేల 596 మంది భక్తులు దర్శించుకున్నారు. 31 వేల 565 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.73 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో శ్యామల రావు. స్వామి వారి దర్శనం కోసం 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 15 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.