పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 3, 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. కడప జిల్లాలోని పులివెందులతో పాటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు పోలింగ్ జరిగింది.