అవసరమైతే తప్పా బయటకు రావద్దు
NEWS Aug 13,2025 08:47 am
బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ఇరు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఆదిలాబాద్, వరంగల్ తో పాటు హైదరాబాద్, తదితర ప్రాంతాలలో వర్షాలు ముంచెత్తాయి. ఈ సందర్బంగా మంత్రి సీతక్క స్పందించారు. భారీ వర్షాలు ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాత్రి వేళల్లో వీలైనంత వరకు బయటికి రావద్దంటూ సూచించారు. తడిసిన గోడలు, పైకప్పులు ఉన్నట్లయితే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పేర్కొన్నారు.