స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైఅలర్ట్ ప్రకటించాయి నిఘా వర్గాలు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందస్తుగా కట్టు దిట్టమైన భద్రత కల్పించారు శంషాబాద్ ఎయిర్ పోర్టులో. ఈ సందర్బంగా సందర్శకులను అనుమతించేది లేదంటూ స్పష్టం చేశారు. అనుమానితుల పట్ల సీఐఎస్ఎఫ్ అధికారుల ప్రత్యేక నిఘా పెట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.ఈ నెల 30 వరకు ఈ హైఅలర్ట్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.