రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దౌసా-మనోహర్పూర్ రోడ్డులో లారీ, వ్యాన్ కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. క్షతగాత్రులను హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరగడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.