వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ లోని నగర వాసులంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది హైడ్రా. ఈ మేరకు కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. మేడ్చెల్, సైబరాబాద్ ప్రాంతాల వాసులు అప్రమత్తంగాఉండాలని పేర్కొన్నారు. కొన్ని చోట్ల 15 సెం. మీ వర్షం కురియగా మరికొన్ని చోట్ల 20 సెం. మీ వర్షపాతం నమోదైందని తెలిపారు. రాబోయే 3 రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్పా ప్రజలకు బయటకు రావద్దని కోరారు .