ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన డీఎస్సీ -2025 పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకం కోసం పరీక్ష నిర్వహించింది. పూర్తిగా పారదర్శకతతో పరీక్షలు నిర్వహించామని, ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నారా లోకేష్. ఫలితాల కోసం ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవాలని సూచించారు.