రేవంత్ రెడ్డి సర్కార్ లో పూర్తిగా ఆంధ్రాకు చెందిన అధికారులదే హవా కొనసాగుతోంది. ఆగస్ట్ 15 న జరిగే ఇండిపెండెన్స్ డే సందర్బంగా వీఏఓలుగా ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆహ్వాన పత్రికను పంపిణీ చేసింది. ఇందులో పూర్తిగా అచ్చు తప్పులు ఉన్నాయి. నెలకు లక్షలు జీతం తీసుకుంటున్న వారికి ఆ మాత్రం సోయి లేక పోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఇకనైనా అచ్చుతప్పులు లేకుండా చూడాలని కోరుతున్నారు.