ఏపీ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని కీలకమైన పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల మొదటి దశ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయాలని, వాటిని రాష్ట్రానికి ఆర్థిక వనరులుగా మార్చాలని ఆయన సూచించారు.