ఏపీ కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త రేషన్ కార్డుదారులకు తీపి కబురు చెప్పింది. ఆగస్టు 25 నుంచి 31వ తేదీ వరకు రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఏటీఎం కార్డు తరహాలో ఉండే ఈ కార్డులపై ఒకవైపు ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కుటుంబ పెద్ద ఫొటో ఉంటుందని తెలిపింది. వచ్చే నెల నుంచి ఈ కార్డుల పైనే రేషన్ పంపిణీ చేస్తామన్నారు మంత్రి మనోహర్.