హన్మకొండలోని మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు మధ్నాహ్న భోజన కార్మికులు నిరసన చేపట్టారు. మధ్యాహ్న భోజనం పథకాన్ని అక్షయపాత్రకు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తూ వారు నిరసనకు దిగారు. అక్షయపాత్రకు మధ్యాహ్న భోజన పథకాన్ని కేటాయించే ప్రతిపాదనను విరమించుకోవాలని నినాదాలు చేశారు. ఈ నిర్ణయం కారణంగా మధ్యాహ్న భోజన పథకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి తీరని నష్టం జరుగుతుందని చెప్పారు.