కేరళలో మందు బాబులకు తీపి కబురు చెప్పింది ఆ రాష్ట్ర బేవరేజెస్ సంస్థ. ఈ మేరకు కీలక ప్రతిపాదన సర్కార్ ముందు ఉంచింది. ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే ఇంటికే మద్యాన్ని సరఫరా చేస్తామని పేర్కొంది. మద్యం దుకాణాల వద్ద పెద్ద ఎత్తున రద్దీ ఉంటోందని, దీనిని నివారించేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.