మాజీ ఐపీఎస్ రఘువీర్ రెడ్డిపై విచారణ
NEWS Aug 11,2025 11:50 am
మాజీ ఐపిఎస్ అధికారి కె. రఘువీర్ రెడ్డి పై విచారణకు ఆదేశించింది ఏపీ సర్కార్. ఎస్సై నుండి ఎస్పీ అయిన రఘువీర్ రెడ్డి గతంలో ఏలూరు, భీమవరం, రాజమండ్రి, కాకినాడ , నరసాపురంలలో పని చేశారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన సమయంలో కీలకంగా వ్యవహరించారు. జగన్ హయాంలో నంద్యాల ఎస్పీగా ఉన్నారు. తాజాగా ఆయనపై ఎంక్వయిరీ అధికారులుగా రామకృష్ణ, షిమోషీలను నియమించింది ప్రభుత్వం.