ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల ప్రతిరోజు ఎంతో రద్దీగా ఉంటుంది. ప్రతి రోజూ 50 వేల నుంచి లక్ష మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటుంటారు. దీంతో, స్వామివారి దర్శనానికి చాలా సమయం పడుతుంటుంది. అయితే, ప్రతిరోజు ఎంతో రద్దీగా ఉండే తిరుమలో నేడు భక్తుల రద్దీ కాస్త తగ్గింది. వర్షాల కారణంగానే రద్దీ తగ్గినట్టు కనిపిస్తోంది.