దక్షిణ కాశ్మీర్లోని కుల్గాంలో కొనసాగుతున్న ఎన్కౌంటర్లో విధి నిర్వహణలో ఇద్దరు జవాన్లు లాన్స్ నాయక్ ప్రిత్పాల్ సింగ్ , సిపాయి హర్మిందర్ సింగ్ లు ప్రాణాలు కోల్పోయారు.ఈ సందర్బంగా భారత సైన్యం నివాళులర్పించింది. దట్టమైన అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఈ ఎన్కౌంటర్ గత పది రోజులుగా కొనసాగుతోంది, ఈ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులను నిర్మూలించడానికి భద్రతా దళాలు తమ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.