కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) నోటీసులు జారీ చేశారు. భారత ఎన్నికల వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతూ ఇటీవల రాహుల్ గాంధీ తీవ్రస్థాయి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కర్ణాటకలో ఒక మహిళా ఓటరు రెండుసార్లు ఓటేశారంటూ రాహుల్ ఆరోపణలు చేశారు.దీనిపై కర్ణాటక సీఈవో స్పందిస్తూ, ఆ ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు సంబంధిత పత్రాలను సమర్పించాలని రాహుల్కు సూచించింది.