మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వర్షాకాలంలో హైదరాబాద్ కు వరద సమస్య ఇప్పటిది కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అన్ని శాఖల సమన్వయంతో నగరవాసుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. భవిష్యత్ ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించామన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.