సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరిగాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. కేసు వివరాలను ఇవ్వాలని పోలీసులకు ఈడీ లేఖ రాసింది. ఇదిలా ఉండగా 8 రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రత కార్యకలాపాలు సాగించినట్లు గుర్తించింది. దాదాపు 80 మంది పిల్లలను విక్రయించి రూ.25 కోట్లు వసూలు చేసినట్లు అనుమానిస్తోంది. ఈ డబ్బులను విదేశాల్లో ఇన్వెస్ట్ చేసినట్లు ఆరా తీస్తోంది.