పీఓకే లోని ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టాం
NEWS Aug 10,2025 07:52 am
ఐఏఎఫ్ ఛీప్ ఏపీ సింగ్ కీలక ప్రకటన చేశారు. మే 9, 10 తేదీల్లో పక్కా ప్రణాళికతో ఆపరేషన్ సిందూర్ నిర్వహించామన్నారు. మే 9న రాత్రి పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశామని, ఆపరేషన్ సిందూర్తో పాక్కు స్పష్టమైన సందేశం ఇచ్చామన్నారు. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, డ్రోన్ వ్యవస్థ బాగా పని చేసిందన్నారు. పాక్కు చెందిన ఓ పెద్ద విమానాన్ని కూడా కూల్చామన్నారు. పాక్తో పాటు పీవోకేలోని ఉగ్ర స్థావరాల పైనా దాడులు చేశామని, ఐదు పాక్ జెట్లను కూల్చి వేశామన్నారు.