రక్తదానం చేసిన సీనియర్ జర్నలిస్టులు
NEWS Aug 09,2025 05:11 pm
రాఖీ పౌర్ణమి, ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండర్ ప్రెసిడెంట్ జెబి బాలు ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సీనియర్ జర్నలిస్టులు భానోత్ వీరు, ఆదాబ్ శ్రీనివాస్ రక్తదానం చేశారు. ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరూ మరొకరి ప్రాణం కాపాడడం కోసం రక్తదానం చేసే కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు లగడపాటి రమేష్ చంద్, తారక రామారావు, బానోతు రాందాస్ నాయక్, ప్రకృతి ప్రేమికుడు బాలు, భరత్, ఫౌండేషన్ సభ్యులు జుబ్బు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.