అగ్రరాజ్యం అమెరికాకు భారత్ ధీటైన జవాబు చెప్పింది. భారత్ పై 50 శాతం సుంకాలు విధించిన ట్రంప్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. అమెరికా నుంచి ఆయుధాలతో పాటు క్షిపణి కొనుగోలు కూడా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ . ఇందులో వైమానిక విమానాల కొనుగోళ్లను కూడా తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు.