జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన బి.శ్రీనివాస్ రావును జగిత్యాల మ్యాంగో ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ అమీన్ ఆధ్వర్యంలో వ్యాపారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా మార్కెట్లోని పలు సమస్యలను వ్యాపారులు కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లగా, సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని కార్యదర్శి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మ్యాంగో ట్రేడర్స్, కమిషన్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.