ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రధాని మోదీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి చెందిన ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని , పరిష్కరించేందుకు కృషి చేయాలని విన్నవించారు. గతంలో కంటే కూటమి సర్కార్ కు కేంద్రం పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తున్నట్లు పీఎం తెలిపారని అన్నారు.