సీఎం రేవంత్ రెడ్డి, సోదరుడు తిరుపతి రెడ్డిల దాడుల నుంచి తమను రక్షించిన కేటీఆర్ కు కృతజ్ఞతతో కోడంగల్ నియోజకవర్గంలోని లగచర్లకు చెందిన తాండా మహిళలు రాఖీ కట్టారు. ఈ సందర్బంగా జ్యోతి కన్నీటి పర్యంతం అయ్యారు. ఆనాడు తనతో పాటు మా వారిందరిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఏ ఒక్కరు స్పందించ లేదన్నారు. కానీ కేటీఆర్ ఒక్కడే ఢిల్లీ వేదికగా ఎండగట్టారని అందుకే తనకు రాఖీ కట్టామన్నారు.