భారీ వర్షాలకు ఏపీలోని ప్రాజెక్టులు నిండుతున్నాయి. కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున నీళ్లు వస్తుండడంతో తుంగభద్ర డ్యామ్ కు వరద ఉధృతి పెరిగింది. దీంతో ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఇన్ఫ్లో 32,459 క్యూసెక్కులు ఉండగా ఔట్ఫ్లో 36,178 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 1626 అడుగులకు చేరుకోగా పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగుల వద్ద నిలిచింది.