ఐఏఎస్ అధికారి శివశంకర్ ను ఏపీకి కేటాయించాలంటూ తాము జారీ చేసిన ఆదేశాలను అమలు చేయక పోవడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. డీఓపీటీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. కాగా శివ శంకర్ ను నాలుగు వారాల్లోగా ఏపీకి కేటాయించాలంటూ గత నెల జూలై 3న ఆదేశించినా పట్టించుకోక పోవడంపై మండిపడింది. 2 వారాల్లోపు అమలు చేయాలని లేక పోతే డీఓపీటీ సెక్రటరీ జీతం నిలిపి వేస్తామని నోటీసు జారీ చేసింది.