కోరుట్లలో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురుని అరెస్టు చేసిన పోలీసులు
NEWS Aug 07,2025 04:18 pm
కోరుట్ల శివారులో గంజాయి తాగుతూ, అమ్మడానికి ప్రయత్నిస్తున్న 6 గురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. రిమాండ్ కు పంపించిన సీఐ సురేష్ బాబు వారి వద్ద నుండి రూ.15 వేల విలువ చేసే అర కిలో గంజాయి, 3 బైకులు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.