లోపూడి పంచాయితీ పరిధిలో పారిశుధ్య పనులు
NEWS Aug 07,2025 09:55 pm
బుచ్చయ్యపేట మండలం లోపూడి పంచాయతీ పరిధిలో ఉన్న బంగారు మెట్టలో పారిశుధ్య పనుల ముమ్మురంగా నిర్వహించారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు ఎంపీడీవో, బానోజి రావు ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శి రామిరెడ్డి పర్యవేక్షణలో పారిశుద్ధ్యం సిబ్బంది దోమల నివారణకు దోమల మందు, పిచికార్ చేశారు. గ్రామంలో అన్ని ప్రధాన వీధులలో కాలంలో కూడిక తొలగించారు. ఇటువంటి కాలంలో దోమలు వృద్ధి పెరగడం, ప్రజలు అనారోగ్యపాల అవడంతో దోమల నివారణ చర్యలు చేపట్టమన్నారు. గ్రామమంతా పారిశుద్ధ్యన్ని మెరుగు పరుస్తామని పంచాయతీ కార్యదర్శి రామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో eoprdo విజయలక్ష్మి పాల్గొన్నారు.