తలసేమియా పేషంట్లకు వైద్య పరీక్షలు
NEWS Aug 07,2025 09:56 pm
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తల సేమియా పేషంట్లకు సొసైటీ ఇన్చార్జ్ మన్సూర్ ఆధ్వర్యంలో ఉచిత రక్త పరీక్షలు, గుండె పరీక్షలు నిర్వహించారు. పిల్లల స్పెషలిస్ట్ డాక్టర్ ప్రేమ్ రాజ్ మాట్లాడుతూ తల సేమియా పేషెంట్లకు, వారి తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించామన్నారు. పేషెంట్లు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వారికి ఎంత రక్తం ఎక్కించాలనే దానిపై తల్లిదండ్రులకు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అజర్ ఖాన్, ఉస్మాన్, ఇర్ఫాన్ అలీ, సోఫియా పాల్గొన్నారు.