జస్టిస్ యశ్వంత్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. తను దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. త్రిసభ్య కమిటీ దర్యాప్తు నివేదికను సవాల్ చేశారు జస్టిస్ యశ్వంత్ వర్మ. అంతర్గత విచారణ కోసం ముగ్గురు హైకోర్టు జడ్జిలతో గతంలో కమిటీ వేసింది. నోట్ల కట్టలు దొరికిన విషయం వాస్తవమేనని తేల్చింది కమిటీ. ఈ వ్యవహారం పార్లమెంట్ లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.